
న్యూఢిల్లీ: ఇండియాలో ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం 476.2 గిగావాట్ల (జీడబ్ల్యూ) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, ఇందులో 49 శాతం రెన్యూవబుల్ వనరులు ద్వారా వస్తోంది. అయినప్పటికీ బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ డేటా ప్రకారం, రెన్యూవబుల్ వనరులు ద్వారా ఉత్పత్తి చేసే కరెంట్ 235.7 జీడబ్ల్యూకి చేరుకుంది. ఇందులో 226.9 జీడబ్ల్యూ కరెంట్ సోలార్, విండ్ వంటి వనరుల నుంచి, 8.8 జీడబ్ల్యూ న్యూక్లియర్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అవుతోంది.
జూన్ 2025 నాటికి భారత్లో పునరుత్పాదక ఇంధనంలో 110.9 జీడబ్ల్యూ సోలార్, 51.3 జీడబ్ల్యూ విండ్ పవర్ సామర్థ్యం ఉంది. అదనంగా, 176.70 జీడబ్ల్యూ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్లు అమలులో ఉన్నాయి. 72.06 జీడబ్ల్యూ బిడ్డింగ్ దశలో ఉన్నాయి. థర్మల్ పవర్ ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తూ, 240 జీడబ్ల్యూ లేదా 50.52శాతం సామర్థ్యంతో ఉంది. తలసరి విద్యుత్ వినియోగం 2013-–14లో 957 కిలో వాట్అవర్ నుంచి 2023-–24లో 1,395 కిలోవాట్అవర్కి చేరుకుంది.