
ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి సీఎస్గా నీరబ్కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు బాధ్యతలు అప్పగించారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సుబ్రమణ్యంను మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది.