నీట్‌‌లో ర్యాంక్‌‌ రాలేదని .. నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా స్టూడెంట్‌‌ సూసైడ్‌‌

నీట్‌‌లో ర్యాంక్‌‌ రాలేదని .. నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా స్టూడెంట్‌‌ సూసైడ్‌‌

కల్వకుర్తి, వెలుగు : నీట్‌‌లో ర్యాంక్‌‌ రాలేదన్న మనస్తాపంతో ఓ స్టూడెంట్‌‌ సూసైడ్‌‌ చేసుకుంది. ఈ ఘటన నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లా వెల్దండ మండలం నారాయణపూర్‌‌లో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇస్లావత్‌‌ పాండు, చిట్టి దంపతుల కూతురు ఇస్లావత్‌‌ శ్రావణి (19) శనివారం విడుదలైన నీట్‌‌లో ర్యాంకు సాధించలేకపోయింది. 

దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి ఆదివారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించగా.. అప్పటికే చనిపోయింది.