హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెమెట్షెక్ జీసీసీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెమెట్షెక్ జీసీసీ

హైదరాబాద్, వెలుగు: ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్, ఆపరేషన్స్  పరిశ్రమలకు సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ సొల్యూషన్లను అభివృద్ధి చేసే జర్మనీ కంపెనీ నెమెట్​షెక్​ గ్రూప్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను (జీసీసీ) మంగళవారం (సెప్టెంబర్ 09) ప్రారంభించింది. ఐఎస్​ఎఫ్ ఫౌండేషన్ హైదరాబాద్ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ, ఐటీ సలహాదారు జేఏ చౌదరి,  నెమెట్​షెక్​ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూయిస్​ ఓఫ్వర్​స్ట్రోమ్ ఈ కార్యక్రమానికి చీఫ్​ గెస్టులుగా వచ్చారు. 

ఈ కొత్త కార్యాలయం భారతదేశంలో నెమెట్​షెక్​ వ్యూహాత్మక విస్తరణకు ముఖ్యమైన మైలురాయి అని కంపెనీ తెలిపింది. ఇక్కడి ఆర్ అండ్​డీ సెంటర్ ​గ్లోబల్ ​టీమ్స్​తో కలిసి పనిచేస్తుందని తెలిపింది. కొత్త జీసీసీలో ఆర్​ అండ్ ​డీ టీమ్స్​, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్​వోసీ), జనరల్, అడ్మినిస్ట్రేటివ్​ ఫంక్షన్స్​ ఉంటాయి. 

దీని సీటింగ్​కెపాసిటీ 250 అని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా లూయిస్ మాట్లాడుతూ, ప్రపంచంలోని చాలా భవనాలను తమ సాఫ్ట్​వేర్​తో తయారు చేశారని తెలిపారు. ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని, ప్రైవేటు కంపెనీలకూ సేవలు అందిస్తున్నామని వివరించారు.