ఈ ఏడాది భారత్లో ఎక్కువమంది చూసిన సినిమాల్లో టాప్ లిస్టులో ధనుష్ కీలక పాత్రలో నటించిన ది గ్రే మ్యాన్ చిత్రం మొదటి స్థానంలో నిలిచింది.2022 ముగుస్తున్న సందర్భంగా ఈ ఏడాది ప్రేక్షకులను అలరించిన చిత్రాలు, వెబ్ సిరీస్లతో పాటు అనేక విషయాలకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఈ ఏడాదిలో ముఖ్యంగా హిట్ అయిన సినిమాలు, కొత్తగా వచ్చిన సెలబ్రిటీల గురించిన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ 2022 సంవత్సరంలో ఎక్కవ మంది చూసిన ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాతో టాప్ లిస్టులో ది గ్రే మ్యాన్ చిత్రం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో సందడి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ టాప్ లిస్టులో వస్తుందనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చిన తర్వాత ఆ సినిమా ఓ రేంజ్లో ట్రేండ్ అయ్యింది. హాలీవుడ్ ప్రేక్షకులు అత్యధికమంది ఓటీటీలో ఆర్ఆర్ఆర్ చూసి ఫిదా అయిపోయారు. అయితే, తాజా జాబితాలో ఈ మూవీకి చోటు దక్కలేదు. రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ది గ్రే మ్యాన్ను ఎక్కువ మంది వీక్షించారు. ఈ చిత్రం జులై 17 నుంచి సెప్టెంబరు 24 మధ్య 265,980,000గంటల స్ట్రీమింగ్ అయినట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. దాదాపు ఆరువారాల పాటు ది గ్రే మ్యాన్ గ్లోబల్ టాప్-10 ట్రెండింగ్లో నిలిచింది.