Samantha: చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి.. సమంతపై నెటిజన్స్ ఫైర్

Samantha: చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి.. సమంతపై నెటిజన్స్ ఫైర్

సౌత్ బ్యూటీ సమంత(Samantha)పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఆమె జనాలకు చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అంటూ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ముందు మీరు మరి తరువాత జనాలకు చెప్పండి అంటూ ఆమెపై రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. సమంత గత కాలంగా మాయోసైటిస్ వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. 

ఈ కారణంగా ఆమె కొన్నాళ్లుగా సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలే ఆ వ్యాధి నుండి కోలుకున్న ఆమె ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ ఫలితాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమా తరువాత తన స్వంతగా ఓ పాడ్ కాస్ట్ షో ను స్టార్ట్ చేశారు సమంత. ఇందులో భాగంగా ఇటీవల కొత్త పాడ్ కాస్ట్ ను రిలీజ్ చేశారు సమంత. ఈ పాడ్ కాస్ట్ లో ఆమె తన ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు.. షుగర్ కలిసిన డ్రింక్స్ తాగడం లేదని, స్వీట్ చాక్లెట్స్ తినడం లేదని, వంటలో కొబ్బరి నూనె వాడుతున్నట్లు, ప్రాసెస్ ఫుడ్స్, టిన్స్, ప్యాకెట్, ప్లాస్టిక్ బాటిల్స్‌లో లభించే ఫుడ్స్ తీసుకోవడం లేదని చెప్పుకొచ్చింది.

ఇక ఇదే విషయంపై సమంతపై మండిపడుతున్నారు నెటిజన్స్. షుగర్ డ్రింక్స్ ఎవైడ్ చేయాలని చెప్పిన సమంత పెప్పీ, ఫెంటా లాంటి స్వీట్స్ డ్రింక్స్ ప్రమోట్ చేశారు, స్వీట్ చాక్లెట్స్ వద్దన్నా ఆమె మంచ్ చాక్లెట్స్ యాడ్స్ చేశారు, వంటలో కోకోనట్ ఆయిల్‌ వాడమన్న ఆమె ఫార్చూన్ సన్ ప్లవర్ ఆయిల్ ను ప్రమోట్ చేశారు, ప్రాసెస్ ఫుడ్ కు దూరంగా ఉండమని తెలిపిన ఆమె కుర్ కురే యాడ్స్ చేశారు.  ఇలా మీరు చెబుతున్నదీ ఒకటి చేస్తోంది మరొకటి, ఆరోగ్యం ఇంపార్టెన్స్ గురించి చెప్పిన మీరే ఇలాంటి ప్రొడక్ట్స్ ను ఎలా  ప్రమోట్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేంతో సమంత లేటెస్ట్ పాడ్ కాస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.