వరుణ్‌,కియారా లపై నెటిజన్లు ఫైర్

వరుణ్‌,కియారా లపై నెటిజన్లు ఫైర్

వరుణ్ ధావన్, కియారా అద్వానీ నటించిన లేటెస్ట్ మూవీ 'జుగ్‌ జుగ్‌ జియో'. రాజ్‌ మెహతా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ముంబైలోని మెట్రో రైల్లో సందడి చేసింది. ఈ క్రమంలో వరుణ్, కియారా వడ పావ్‌ తింటూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో మెట్రో రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తించిన వరుణ్, కియారాల పైన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘మెట్రోలో ఆహార పదార్థాలు అనుమతి లేదనే విషయం కూడా తెలియదా?’, ‘వీరిపై మెట్రో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఈ వీడియోలో వరుణ్, కియారాలతో పాటుగా సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్ కూడా ఉన్నారు.