నన్ను కొనగలిగే వ్యక్తి ఇంకా పుట్టలేదు

నన్ను కొనగలిగే వ్యక్తి ఇంకా పుట్టలేదు

తనను డబ్బుతో కొనగలిగే వ్యక్తి ఇంకా పుట్టలేదన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. బెంగాల్ లో కోల్పోతున్న ఓటుబ్యాంక్ ను చూసి మమత ఇప్పటికైనా జాగ్రత్తపడాలన్నారు . మజ్లిస్ పోటీ బీజేపీకి సానుకూలం అవుతుందన్నది కరెక్ట్ కాదని… హైదరాబాద్ లో ఎంఐఎం బీజేపీని ఎదుర్కొని తన స్థానం నిలబెట్టుకుందన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో మాజీ మంత్రి రాజ్ భర్ ను కలిశారు ఒవైసీ. 8 పార్టీలతో ఉన్న తమ భాగీదారీ సంకల్ప్ మోర్చా కూటమితో కలిసి పనిచేసేందుకు ఒవైసీ ఆసక్తితో ఉన్నారన్నారు రాజ్ భర్. విద్య, ఆరోగ్యం ఈ రెండు అంశాలే అజెండాగా యోగీ సర్కారుపై పోరాడుతామన్నారు.

బుమ్రా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు