––టాలీవుడ్ కొత్త జంట వరుణ్(Varun), లావణ్య(Lavanya) పెళ్లి తరువాత తొలిసారి కెమరా ముందు మెరిశారు. నిహారిక(Niharika) నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై వస్తున్న కొత్త సినిమా పూజ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వరుణ్, లావణ్య ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
యదు వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా.. మెగా హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. ఇందులో భాగంగా నిహారిక మాట్లాడుతూ.. మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థల్లో ఇప్పటివరకు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ మాత్రమే చేశాం కానీ.. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ ప్రారంభించాం. అందరూ కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు నిహారిక. ఇక పెళ్లి తరువాత తొలిసారి ఈ జంట మీడియా ముందుకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.