డిస్కంలలో తాత్కాలిక డైరెక్టర్ల నియామకం

డిస్కంలలో తాత్కాలిక డైరెక్టర్ల నియామకం
  •  సదరన్‌‌‌‌లో నలుగురు, నార్తర్న్‌‌‌‌లో ముగ్గురికి బాధ్యతలు
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎండీలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: విద్యుత్‌‌‌‌ పంపిణీ సంస్థలైన సదరన్‌‌‌‌, నార్తర్న్‌‌‌‌ డిస్కంల పరిధిలోతాజాగా డైరెక్టర్లను తొలగించిన నేపథ్యంలో పలువురు సీనియర్‌‌‌‌ అధికారులకు తాత్కాలిక డైరెక్టర్‌‌‌‌ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం సీఎండీ ముషారఫ్‌‌‌‌ ఫారూకీ ఉత్తర్వులు జారీ చేశారు. సదరన్ డిస్కం(టీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌పీడీసీ ఎల్‌‌‌‌)లో  సీజీఎం కే. రాములుకు కమర్షియల్‌‌‌‌, ఐపీసీ, ఆర్‌‌‌‌ఏసీ డైరెక్టర్‌‌‌‌గా, సీజీఎం నందకుమార్‌‌‌‌కు ప్రాజెక్ట్స్‌‌‌‌, ఐటీ, ఈఏ, డీపీఈ, అసెస్‌‌‌‌మెంట్స్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ గా నియమించారు.
సీజీఎం నర్సింహులును ఆపరేషన్స్‌‌‌‌, పీ అండ్‌‌‌‌ ఎంఎం డైరెక్టర్‌‌‌‌గా, సీజీఎం సుధా మాధురిని ఫైనాన్స్‌‌‌‌, హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ ఐఆర్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌గా బాధ్యతలు అప్పగించారు.

నార్తర్న్‌‌‌‌ డిస్కంలో ముగ్గురికి బాధ్యతలు

నార్తర్న్‌‌‌‌ డిస్కంలో ముగ్గురు సీనియర్‌‌‌‌ అధికారులను తాత్కాలిక డైరెక్టర్‌‌‌‌లుగా నియమిస్తూ సీఎండీ కర్నాటి వరుణ్‌‌‌‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీజీఎం సదర్‌‌‌‌లాల్‌‌‌‌కు ప్రాజెక్ట్స్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌గా నియమించారు.  సీజీఎం మోహన్‌‌‌‌రావుకు  ఆపరేషన్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌గా, సీజీఎం ఆశోక్‌‌‌‌కుమార్‌‌‌‌కు హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌డీ, ఐఆర్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌గా బాధ్యతలు అప్పగించారు.