హైదరాబాద్, వెలుగు : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ సుజయ్ పాల్ ఈ నెల 26న, జస్టిస్ మౌసమీ భట్టాచార్య ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్జస్టిస్ అలోక్ అరాధే హైకోర్టు
మొదటి హాల్ లో వాళ్లతో ఉదయం 10 గంటలకు ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్ సుజయ్ పాల్ మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి, జస్టిస్ మౌసమీ భట్టాచార్య కలకత్తా హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్నారు.