
- జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజ రెడ్డి
ఆర్మూర్, వెలుగు: ఆలూర్ మండల కేంద్రంలో నూతన గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి అన్నారు. సోమవారం ఆలూర్కు వచ్చిన ఆయనకు కొన్ని రోజులుగా మూసి ఉన్న గ్రంథాలయాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరారు. త్వరలోనే ఆలూర్లో నూతన గ్రంథాలయ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని, రూ.40 లక్షల వరకు నూతన భవనం నిర్మాణానికి నిధుల మంజూరు కోసం కృషి చేస్తానన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియలు చేపడుతున్న తరుణంలో నిరుద్యోగులు, యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యాల్ల సాయరెడ్డిని కాంగ్రెస్ నాయకులు, గ్రామ యువకులు గ్రాంథాలయ చైర్మన్ను సన్మానించారు.