కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌‌గా ప్రఫుల్‌ దేశాయ్‌

కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌‌గా  ప్రఫుల్‌ దేశాయ్‌

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్  మున్సిపల్ కమిషనర్‌‌గా ప్రఫుల్‌ దేశాయ్‌ని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ  చేశారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన చాహత్ 

బాజ్‌పాయ్​ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌‌గా పనిచేస్తున్న అశ్విని తానాజి వాకడెను  కరీంనగర్  అడిషనల్  కలెక్టర్(లోకల్ బాడీస్)గా నియమించారు.