
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా ప్రఫుల్ దేశాయ్ని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన చాహత్
బాజ్పాయ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేశారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న అశ్విని తానాజి వాకడెను కరీంనగర్ అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్)గా నియమించారు.