తెలంగాణ ఉన్నత పాఠ‌శాల‌ల ప‌నివేళ‌లు మార్పు

తెలంగాణ ఉన్నత పాఠ‌శాల‌ల ప‌నివేళ‌లు మార్పు

తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ ఉన్నత పాఠ‌శాల‌ల ప‌నివేళ‌లు మారుస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠ‌శాల‌లు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4.15 గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంటాయని పేర్కొంది. కాగా ఇప్పటివ‌ర‌కు ఉన్నత పాఠ‌శాల‌లు ఉద‌యం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంట‌ల వ‌ర‌కు ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మరోవైపు  ప్రైమ‌రీ, అప్పర్ ప్రైమ‌రీ స్కూల్స్ య‌థావిధిగా ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4.15 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని అధికారులు తెలిపారు. హైద‌రాబాద్, సికింద్రాబాద్ న‌గ‌రాల్లో కూడా య‌థావిధిగా ఉద‌యం 8.45 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పాఠ‌శాల‌లు తెరిచి ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.