హైదరాబాద్ సిటీ, వెలుగు: చర్లపల్లి–తిరుచానూరు (ట్రైన్ నం. 17059) మధ్య నడిచే స్పెషల్ట్రైన్ ను రెగ్యులర్సర్వీసుగా మారుస్తూ కేంద్ర రైల్వే శాఖ అప్రూవల్ ఇచ్చినట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో సందర్భానుసారంగా నడిపిన ఈ రైలును ఇక నుంచి ప్రతి ఆదివారం చర్లపల్లి–తిరుచానూరు, ప్రతి సోమవారం తిరుచానూరు– చర్లపల్లి (ట్రైన్ నం. 17060) మధ్య నడపనున్నట్టు అధికారులు ప్రకటించారు.
ఈ నెల 17 ఆదివారం చర్లపల్లి నుంచి బయలు దేరే ఈ రైలు తిరిగి 18న సోమవారం తిరుచానూరు నుంచి చర్లపల్లికి బయలుదేరుతుందని తెలిపారు. అలాగే, ధర్మవరం–నాందేడ్ మధ్య వీక్లీ ట్రైన్ ను సైతం రెగ్యులర్ రైలుగా కేంద్ర రైల్వే శాఖ అప్రూవ్ ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ట్రైన్ నం. 17635 నాందేడ్–ధర్మవరం, ట్రైన్ నం. 17636 ధర్మవరం–నాందేడ్ మధ్య కూడా ప్రతి ఆదివారం, సోమవారాల్లో రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
