కరాచీలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న కివీస్ ప్లేయర్లు

కరాచీలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న కివీస్ ప్లేయర్లు

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. పలువురు సెలబ్రెటీలు సైతం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని హుషారెత్తించారు. ఇక న్యూజిలాండ్ ప్లేయర్లు కూడా క్రిస్మస్ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పాకిస్థాన్లోని కరాచీలో ఉన్న కివీస్ ప్లేయర్లు ఓ హోటల్‌లో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. 

ఓ హోటల్‌లోని హాల్‌లో భారీ డైనింగ్ టేబుల్‌ను అందంగా అలకరించి దానిపై రుచికరమైన ఆహార పదార్థాలను భుజించారు. క్రిస్మస్ పాటలు పాడుతూ సందడి చేశారు. న్యూజిలాండ్ కొత్త కెప్టెన్ టీమ్ సౌథీ, కేన్ విలయమ్సన్, అజాజ్ పటేల్, సహా పలువురు ఆటగాళ్లు క్రిస్మస్ వేడకల్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా..అది వైరల్ అయ్యింది. 

కాగా న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం పాకిస్థాన్లో పర్యటిస్తోంది. టెస్ట్ మ్యాచ్ సిరీస్ కోసం ఇరు జట్ల మధ్య ఇవాళ తొలి టెస్ట్ జరుగుతోంది.అంతకుముందు ఆటగాళ్లు ఈ వేడుకలను జరుపుకున్నారు.