
జీడిమెట్ల, వెలుగు: చెత్త కుప్పలో నవజాత శిశువును పడేసిన ఘటన పేట్బషీరాబాద్ పరిధిలో జరిగింది. సుచిత్రలోని గ్రీన్ పార్క్ఎవెన్యూలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ నవజాత ఆడ శిశువును తెచ్చి చెత్త కుప్పలో పడేసి వెళ్లారు. దీంతో స్థానికులు గమనించి డయల్100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వెళ్లే సరికి శిశువు చనిపోయి ఉంది. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.