తెలంగాణలో కొత్తగా 1,421 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,421 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,421 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,29,001 కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం కరోనా బారినపడి ఆరుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1298కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,221 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,07,326గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,377 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 17,214 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. గురువారం 38,484 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 40,17,353 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా మరియు రికవరీ రేటు 90.53 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 249, మేడ్చల్ 111, రంగారెడ్డి 97, ఖమ్మం 89, భద్రాద్రి 86, నల్గొండ 79, కరీంనగర్ 75, సిద్ధిపేట్ 57, వరంగల్ అర్బన్ 52 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

జోష్ లేని దసరా.. పల్లెలు, పట్నంలో కానరాని సంబురం

అప్పు చెల్లించలేదని రైతు పొలంలో బ్యాంకోళ్ల ఎర్రజెండాలు

కరోనాతో భర్త.. తట్టకోలేక బిల్డింగ్ పైనుంచి దూకి భార్య..