రాష్ట్రంలో కొత్తగా 1,607 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,607 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,607 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,48,891 కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం కరోనా బారినపడి ఆరుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,372కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 937 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,27,583గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,936 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 17,134 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం 44,644 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 45,75,797 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతంగా మరియు రికవరీ రేటు 91.43 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 296, భద్రాద్రి 124, రంగారెడ్డి 115, మేడ్చల్ 113, ఖమ్మం 84, కరీంనగర్ 78, సిద్ధిపేట్ 69, నల్గొండ 67, వరంగల్ అర్బన్ 48, సూర్యపేట్ 46, నాగర్ కర్నూల్ 43, జగిత్యాల్ 42, సంగారెడ్డి 41, ములుగు 37 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

సైబర్ మీడియా రీసెర్చ్ : చిన్నా పెద్దా అందరూ మొబైల్ గేమ్స్ లోనే..

మెయిన్స్​లో మెరవాలంటే ఈ టిప్స్ ఫాలోవ్వండి

తెలంగాణ యువత గోస కనబడతలేదా?

దుబ్బాక రిజల్ట్స్​ ప్రకటించొద్దు