రాష్ట్రంలో మరో 2,123 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో మరో 2,123 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,123 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,69,169 కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం కరోనా బారినపడి 9 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1025కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,151 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,37,508గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 24,070 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం 54,459 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 23,34,409 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 305, రంగారెడ్డి 185, మేడ్చల్ 149, నల్గొండ 135, కరీంనగర్ 112, ఖమ్మం 93, సిద్ధిపేట్ 87, వరంగల్ అర్బన్ 81, నిజామాబాద్ 78, మహబూబా బాద్ 77, కామారెడ్డి 72, సంగారెడ్డి 71, సూర్యపేట్ 65, సంగారెడ్డి 59, భద్రాద్రి 53, జగిత్యాల 53 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

పండుగ షాపింగ్‌కి నో ఇంట్రెస్ట్

అసైన్డ్ భూములు దర్జాగా అమ్మి పత్తాలేకుండా పోయిన లీడర్లు, రియల్టర్లు

వీడియో: ఒక కాలు లేకున్నా.. ఒంటికాలుతో పొలం పనులు