తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,239 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,83,866 కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం కరోనా బారినపడి 11 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1091కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,281 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,52,441గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,334 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 24,683 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం 58,925 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 28,00,761 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా మరియు రికవరీ రేటు 82.90 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 316, రంగారెడ్డి 192, మేడ్చల్ 164, నల్గొండ 141, కరీంనగర్ 106, భద్రాద్రి 91, వరంగల్ అర్బన్ 91, సిద్ధిపేట్ 79, ఖమ్మం 73, నిజామాబాద్ 69, సంగారెడ్డి 66, సూర్యపేట్ 63, కామారెడ్డి 60, సిరిసిల్ల 57, మహబూబా బాద్ 57, జగిత్యాల 54, యాదాద్రి 58 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

వీడియో: ల్యాండింగ్ సమయంలో కూలిన సైనిక విమానం.. 22 మంది మృతి

పాకిస్తాన్ మమ్మల్ని జంతువుల్లా చూస్తోంది

కుక్క మొరిగిందా.. కరోనా ఉన్నట్టే.. అదేలాగంటే..