రాష్ట్రంలో కొత్తగా 837 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 837 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 837 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,32,671 కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం కరోనా బారినపడి నలుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,315కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,554 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,13,466గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,890 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 14,851 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. సోమవారం 21,099 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 41,15,516 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా మరియు రికవరీ రేటు 91.14 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 185, మేడ్చల్ 41, రంగారెడ్డి 59, ఖమ్మం 76, భద్రాద్రి 48, కరీంనగర్ 51, సిద్ధిపేట్ 40, వరంగల్ అర్బన్ 34, నాగర్ కర్పూల్ 31 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

ఆస్ట్రేలియా టూర్‌‌కు టీమిండియా ఎంపిక.. ఒక్క ఫార్మాట్‌కు ఎంపిక కాని రోహిత్ శర్మ

వరదల్లో పాడైన వాహానాలకు నో ఇన్సూరెన్స్

పై చదువుల కోసం పక్క రాష్ట్రాలకు పోనంటున్న స్టూడెంట్లు