కొడంగల్, వెలుగు: ఎన్హెచ్167 విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారికి 10 రోజుల్లో పరిహారం చెల్లిస్తామని వికారాబాద్ కలెక్టర్ప్రతీక్జైన్ తెలిపారు. కలెక్టరెట్లో నిర్వాసితులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. 107 మందికి చెందిన 55,114 చదరపు అడుగుల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఇందులో కట్టడాలు, బోర్ వెల్స్, చెట్ల విలువలను చూసి నష్ట పరిహారం ఇస్తామన్నారు.
