సీఎస్​కు ఎన్​హెచ్ఆర్​సీ నోటీసులు

సీఎస్​కు ఎన్​హెచ్ఆర్​సీ నోటీసులు
  • ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ (ఎన్​హెచ్​ఆర్​సీ) తెలంగాణ సీఎస్​ శాంతి కుమారిని ఆదేశించింది. గడువు లోపు నివేదికను అందించకపోతే మానవహక్కుల పరిరక్షణ చట్టం కింద కమిషన్ ముందు సీఎస్​ వ్యక్తిగతంగా హాజరుకావాలని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

రాష్ట్రంలోని చాలా స్కూళ్లలో మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయని మల్కాజ్​గిరి కార్పొరేటర్ వూరపల్లి శ్రవణ్ గత నెల 18న ఎన్​హెచ్​ఆర్​సీకి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.