ఖైరతాబాద్,వెలుగు: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జోక్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని పలువురు వక్తలు కోరారు. వీక్షణం సంపాదకుడు వేణు ఇంటిపై ఈనెల 8న ఎన్ఐఏ దాడి చేసి సెల్ఫోన్ ఎత్తుకు పోయిన నేపథ్యంలో వీక్షణం కలెక్టివ్ ఆధ్వర్యంలో ‘జర్నలిస్టులపై ఎన్ఐఏ దాడులను ఖండించండి’ అంశంపై బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సీనియర్ జర్నలిస్టులతో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఎడిటోరియల్ కలెక్టివ్సభ్యుడు ఎ.నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ దేశంలో,రాష్ట్రంలోని అన్ని ప్రజాసంస్థలను, వ్యవస్థలను ధ్వంసం చేసిన పాలకులు జర్నలిస్టుల మీద దాడిచేస్తున్నారని ఆరోపించారు.
స్వేచ్ఛగా అభిప్రాయాలు ప్రకటించే జర్నలిస్టులు 10 ఏండ్లలో ఆ స్థానాన్ని పోగొట్టుకున్నారని సంపాదకుడు కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. పాలకులు జర్నలిస్టుల విశ్వసనీయతను పోగొట్టాలని ప్రయత్నిస్తున్నారని,దానిలోభాగమే దాడులు, తప్పుడు ఆరోపణలు, కేసులు అన్నారు. సీనియర్జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ, సీనియర్ జర్నలిస్టు కె.శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ యూనియన్ ఆఫ్వర్కింగ్జర్నలిస్ట్స్ అధ్యక్షుడు విరాహత్ అలీ, కల్లూరి భాస్కరం, ఎం.రహమాన్, మారుతీ సాగర్తదితరులు పాల్గొని మాట్లాడారు.