ఉగ్ర వేట : తమిళనాడులో కొనసాగుతున్న NIA సోదాలు

ఉగ్ర వేట : తమిళనాడులో కొనసాగుతున్న NIA సోదాలు

తమిళనాడులో NIA సోదాలు కొనసాగుతున్నాయి. అన్సరుల్లా ఉగ్రవాద సంస్థ లింకుల కేసులో ఇప్పటికే ఐదు జిల్లాల్లో 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించింది NIA. సోదాలు ఇంకా కంటిన్యూ చేస్తోంది.

తాజా మధురై, నరిమడులోని మహ్మద్ షేక్ ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. దుబాయ్ ప్రభుత్వం అందించిన సమాచారంతో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్ఐఏ ఈ సోదాలు చేస్తోంది.

తమదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ… ఉగ్రవాద సంస్థలకు సానుభూతిపరులుగా ఉంటున్నారన్న సమాచారంతో దుబాయ్ ప్రభుత్వం ఇటీవల 15 మందిని తమిళనాడుకు తిప్పిపంపింది. ఆ తర్వాత ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి.