‘కార్తికేయ-2’ చిత్రంతో ఈ ఏడాది సూపర్ సక్సెస్ను అందుకున్నాడు నిఖిల్. ప్యాన్ ఇండియా వైడ్గా ఇది విజయం సాధించింది. ఈ జోష్లో అతి త్వరలో ‘18 పేజెస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోన్న నిఖిల్.. తాజాగా మరో కొత్త చిత్రానికి సైన్ చేసినట్టు టాక్. భరత్ కృష్ణమాచారి అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట. తమిళ దర్శకుడు మిస్కిన్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసిన భరత్... కొన్నేళ్ల క్రితం నయనతారతో ఓ భారీ మూవీకి ప్లాన్ చేశాడు. కానీ వర్కవుట్ అవలేదు.
ఇప్పుడిక నిఖిల్ హీరోగా పౌరాణిక కథతో ఓ సినిమా చేయబోతున్నాడు. 11వ శతాబ్దానికి ప్రస్తుత కాలంతో ముడిపెడుతూ డిఫరెంట్ స్టోరీ లైన్తో ఈ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. ఠాగూర్ మధు నిర్మించబోయే ఈ చిత్రం మార్చి నుండి షూటింగ్ మొదలవబోతోంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్కి అధిక ప్రాధాన్యత ఉండడంతో, నిఖిల్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కానుందట. ‘కార్తికేయ 2’తో నిఖిల్కు ప్యాన్ ఇండియా ఇమేజ్ రావడంతో హిందీతో పాటు సౌత్లోని మిగతా భాషల్లోనూ దీన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.