అదే నా బాధ.. అందుకే రిలీజ్ చేయొద్దన్నాను

అదే నా బాధ.. అందుకే రిలీజ్ చేయొద్దన్నాను

కార్తికేయ 2(Karthikeya2), 18 పేజీస్(18 Pages) వంటి వరుస హిట్ల తరువాత యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ(Nikhil siddarth) చేస్తున్న మరో పాన్ ఇండియా మూవీ స్పై(Spy). స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కితోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ కానుంది అనే వార్తలు బలంగా వినిపించాయి. హీరో నిఖిలే స్వయంగా ఈ సినిమా పోస్ట్ పోన్ చేయమని మేకర్స్ కు చెప్పాడని ఆ వార్తల సారాంశం. 

ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు నిఖిల్.. "నా బాధంతా ఒకటే. ప్రస్తుతం సినిమా టికెట్ రేట్లు 200 నుండి 250 రూపాయల వరకు వెళ్ళిపోయాయి. కాబట్టి మనం ఇచ్చే అవుట్ ఫుట్ కూడా ఆ ధరను మ్యాచ్ చేసేలా ఉండాలి. కొన్ని రోజుల క్రితం నేను ఈ సినిమా చూసినప్పుడు ఇంకా చాలా వర్క్ బ్యాలెన్స్ ఉందని, అందుకే 29వ తేదీ రిలీజ్ వద్దు అన్నాను. అయితే 200 మంది చేయాల్సిన విఎఫ్ఎక్స్ మీద 2000 మంది పనిచేశారు. దాదాపుగా మా ఒక్క సినిమా కోసమే ఐదారు విఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేశాయి. అందుకే ఈరోజు విజయవంతంగా సెన్సార్ కూడా పూర్తి చేయగలిగామని" చెప్పుకొచ్చారు నిఖిల్.

దీంతో ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది. దర్శకుడు గ్యారీ బీహెచ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తూ కథ అందించడం విశేషం.