పంజాగుట్ట, వెలుగు : నిమ్స్లో ఇప్పటి వరకు15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె సర్జరీలు చేసినట్లు నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప వెల్లడించారు. దీనిలో భాగంగా 500 మంది చిన్నారులకు గుండె పరీక్ష స్క్రీనింగ్ నిర్వహించి సమస్య తీవ్రతను గుర్తించామన్నారు. శనివారం నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ బీరప్ప మాట్లాడుతూ..
స్పెషాలిటీ బ్లాక్లో ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రూమ్ నెంబర్ 10లో ప్రత్యేకంగా కార్డియాలజీ ఓపీ కన్సల్టేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. డాక్టర్లు అంబరీస్ రావ్, ప్రవీణ్ రావ్, గోపాల్, రమణ సర్జరీల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.