
హైదరాబాద్సిటీ, వెలుగు : నిమ్స్లో మంగళవారం అత్యధిక సంఖ్యలో అవుట్పేషెంట్లు తరలివచ్చి వివిధ రకాల వైద్య సేవలు పొందారని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. 4,055 మంది పేషెంట్లు ఓపీతో పాటు ఇన్పేషెంట్గా చేరారని, ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ సేవలు కూడా ఉపయోగించుకున్నారన్నారు.
కార్డియాలజీలో 278 మంది, క్లినికల్ ఇమ్యునాలజీ, రుమటాలజీలో 397, జనరల్ మెడిసిన్ లో 345, నెఫ్రాలజీలో 418, న్యూరాలజీలో 363, ఆర్థోపెడిక్స్ లో 347 మంది చూపించుకున్నారన్నారు. 265 మంది అడ్మిట్అయ్యారన్నారు. అదనంగా 60 మంది రోగులు అత్యవసర విభాగంలో చికిత్స పొందారని ప్రొఫెసర్ బీరప్ప ప్రకటించారు.