బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విస్తరిస్తున్న క్రమంలో ATM వినియోగదారులకు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. డెబిట్ కార్డు వినియోగదారులు రానున్న 3 నెలలపాటు ఉచితంగా అన్ని బ్యాంకుల ATMలలో ఎన్నిసార్లైనా విత్ డ్రా చేసుకోవచ్చని ప్రకటించారు. అలాగే అన్ని బ్యాంకుల  సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ రూల్స్ ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపారు మంత్రి నిర్మలాసీతారామన్.