న్యూఢిల్లీ: ప్రజలకు మరింత చౌకగా రవాణా సదుపాయాలను అందుబాటులోకి తేవడానికి కరెంటు ఆధారిత టెక్నాలజీ కోసం చూస్తున్నామని కేంద్ర హైవేలు, రోడ్డు ట్రాన్స్పోర్టు శాఖల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇందుకోసం ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈవీ ఫ్యాక్టరీ టెక్నాలజీ, రెట్రోఫిట్టింగ్ ఇండస్ట్రీల ఆర్ అండ్ డీ లతో కలసి పనిచేయాలని అమెరికా కంపెనీలను కోరారు. త్వరలో ఈవీల బ్యాటరీ స్వాపింగ్ పాలసీని, స్టాండర్డ్స్ను ప్రకటిస్తామని వెల్లడించారు. రద్దీ, కొండ ప్రాంతాల్లో రోడ్లు వేయడం కంటే రోప్వే ప్రాజెక్టులకు ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పారు. జమ్మూ, కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, హనిపూర్, సిక్కింలో 11 రోప్వేలను నిర్మిస్తామని ప్రకటించారు. ‘రీబిల్డింగ్ ఇన్ఫ్రా ఫర్ ఇండియా 2.0’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా కంపెనీలను, ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రోప్వేల కోసం ఉపయోగించే కేబుల్ కార్ టెక్నాలజీ కోసం ఇది వరకే కొన్ని కంపెనీలు తనను సంప్రదించాయని చెప్పారు. తనకు లైట్ రైల్ ట్రాన్స్పోర్టు టెక్నాలజీలపై పనిచేయడం ఇష్టమని అన్నారు. అన్ని పోర్టులు, జలాశయాల మధ్య వేగవంతమైన రవాణా కోసం పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం 2,050 కిలోమీటర్ల మేర 65 ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్పారు. నేషనల్ హైవేలపై ఫైటర్ ప్లేన్లను ల్యాండ్ చేయడానికి 29 ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ఏర్పాటుచేస్తున్నామని గడ్కరీ వెల్లడించారు. ఇలాంటి ప్రాజెక్టుల్లో భారీగా ఇన్వెస్ట్ చేయాలని అమెరికా కంపెనీలను కోరారు. టెక్నోక్రాట్లు సాయపడితే ఇండియాకు బెస్ట్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ను తయారు చేయవచ్చని మంత్రి అన్నారు. ఇలాంటి ప్రాజెక్టుల కోసమే రోడ్ సెక్టార్లో 100 శాతం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లకు అనుమతులు ఇచ్చామని నితిన్ గడ్కరీ వివరించారు.