నిజాం కాలేజ్ గ్రౌండ్స్ 2.5కె రన్... చిన్నబోయిన దేవేందర్యాదవ్ మెమోరియల్ నిర్వహణ

నిజాం కాలేజ్ గ్రౌండ్స్ 2.5కె రన్... చిన్నబోయిన దేవేందర్యాదవ్ మెమోరియల్ నిర్వహణ

ఓల్డ్​ సిటీ, వెలుగు: 35వ చిన్నబోయిన దేవేందర్​యాదవ్​ మెమోరియల్​రన్​ను ఆదివారం నిజాం కాలేజ్​ గ్రౌండ్స్​లో నిర్వహించారు. 2.5 కె రన్​బాలుర విభాగంలో ఇ.వెంకటేష్​, సీహెచ్.సిద్ధు, ఇ.రవితేజ గౌడ్, బాలికల విభాగంలో ఎ.లౌక్య, భూర్వీ, దిశా జోషి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్​ కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్​ఎల్​బీ.లక్ష్మీకాంత్​ రాథోడ్, మాజీ మంత్రి చిన్నబోయిన కృష్ణ యాదవ్,  అథ్లెటిక్ కోచింగ్​అకాడమీ సెక్రటరీ రాజేశ్​కుమార్​తదితరులు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు.