బషీర్ బాగ్, వెలుగు: కాంగ్రెస్ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్హామీతో నిజాం కాలేజీ యూజీ స్టూడెంట్లు ఆందోళనను విరమించారు. కాలేజీ గర్ల్స్హాస్టల్ను పూర్తిస్థాయిలో తమకే కేటాయించాలని యూజీ స్టూడెంట్లు ఆరు రోజులుగా క్యాంపస్లో ఆందోళన చేస్తున్నారు. నిరసనలో భాగంగా గురువారం వంటా వార్పు చేపట్టారు. అదే టైంలో అక్కడికి చేరుకున్న పీజీ స్టూడెంట్లు తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బల్మూర్వెంకట్ నిజాం క్యాంపస్కు చేరుకుని యూజీ, పీజీ స్టూడెంట్లను సముదాయించారు.
సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారని, రాగానే సమస్యపై చర్చించి న్యాయం చేస్తామని చెప్పారు. ఈలోపు ఓయూ వీసీతో మాట్లాడతామన్నారు. ప్రస్తుత పీజీ స్టూడెంట్ల అకడమిక్ఇయర్పూర్తయిన వెంటనే డిగ్రీ స్టూడెంట్లకు కాలేజీ హాస్టల్ను పూర్తిస్థాయిలో కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో ఆ మేరకు సర్క్యులర్విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు.
అదే విధంగా పీజీ స్టూడెంట్లకు న్యాయం చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న హాస్టల్పై మరో రెండు అంతస్తులు నిర్మించడమా? లేక కొత్త బిల్డింగ్నిర్మించడమా అనే అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం యూజీ స్టూడెంట్లు మాట్లాడుతూ.. వచ్చే సోమవారం వరకు సర్క్యులర్కోసం ఎదురుచూస్తామని, లేకుంటే ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
