నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ముగ్గురు సిట్టింగ్ బీఅర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ఇవాళ కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ ఆలీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందుతోందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రజాపాలన చూసి యావత్ తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ వైపుకు చూస్తోందన్నారు. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా కాంగ్రెస్ అమలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.