
నిజామాబాద్, వెలుగు: స్టేట్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి మీటింగ్కు మంగళవారం జిల్లా పార్టీ ముఖ్య లీడర్లు వెళ్లారు. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ ఆధ్వర్యంలో జరిగినమీటింగ్లో డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు పాల్గొన్నారు.
నేడు సన్మానాలు..
సంవిధాన్ బచావో కమిటీ సభ్యుడిగా నియామకమైన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీద్ఖాన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పదవి పొందిన రాంభూపాల్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణను డీసీసీ పక్షాన బుధవారం సన్మానించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలని ప్రెసిడెంట్ మోహన్రెడ్డి
కోరారు.