సీఎం రేవంత్తో .. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల భేటీ

సీఎం రేవంత్తో .. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల భేటీ

నిజామాబాద్, వెలుగు: స్టేట్ కాంగ్రెస్​ కమిటీ విస్తృత స్థాయి మీటింగ్​కు మంగళవారం జిల్లా పార్టీ ముఖ్య లీడర్లు వెళ్లారు. సీఎం రేవంత్​రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్​ ఆధ్వర్యంలో జరిగినమీటింగ్​లో డీసీసీ ప్రెసిడెంట్​ మానాల మోహన్​రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు పాల్గొన్నారు. 

నేడు సన్మానాలు.. 

సంవిధాన్​ బచావో కమిటీ సభ్యుడిగా నియామకమైన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీద్​ఖాన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పదవి పొందిన రాంభూపాల్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణను డీసీసీ పక్షాన బుధవారం సన్మానించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్​ శ్రేణులు తరలిరావాలని ప్రెసిడెంట్ మోహన్​రెడ్డి 
కోరారు.