నిజామాబాద్ జిల్లాలో 15 మంది వీడీసీ సభ్యులకు ఐదేండ్ల జైలు శిక్ష

నిజామాబాద్ జిల్లాలో 15 మంది వీడీసీ సభ్యులకు ఐదేండ్ల జైలు శిక్ష

నిజామాబాద్, వెలుగు: జక్రాన్పల్లి మండలం కొలిప్యాక్ గ్రామానికి చెందిన ఆరోళ్ల రుక్కవ్వ పొలం పన్న'కు అడ్డు తగులుతూ సంఘ బహిష్కరణ శిక్ష విధించిన 15 మందికి ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శ్రీనివాస్ మంగళవారం తీర్పు చెప్పారు. రెండు సెక్షన్ల లో వేర్వేరుగా విధించిన శిక్షను ఏకకాలంలో అనుభవించాలన్నారు.

 2020 ఏప్రిల్ 22న ట్రాక్టర్లో గడ్డి వేసుకుని భర్త. కుమారుడితో కలిసి వస్తుండగా వీడీసీ సభ్యులైన మేకల బబ్లూ, మేకల భవాని అడ్డుకున్నారు. తమ ఆదేశాలు లేకుండా గడ్డి తోలుకోడానికి వీలులేదని ట్రాక్టర్కు అగ్గిపెడతామని బెది రించారు. పంచాయితీ నిర్వహించి రుక్కవ్వ ఆమె కుటుంబంపై సంఘ బహిష్కరణ శిక్ష విధించారు.