ఇందూరు అభివృద్ధికి నిధులు కేటాయించాలి : ఎమ్మెల్యే ధన్పాల్

ఇందూరు అభివృద్ధికి నిధులు కేటాయించాలి : ఎమ్మెల్యే ధన్పాల్
  •     సీఎం రేవంత్​రెడ్డిని కోరిన ఎమ్మెల్యే ధన్​పాల్

నిజామాబాద్ అర్బన్, వెలుగు : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మంగళవారం సీఎం ఆఫీస్​లో సీఎం రేవంత్​రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని12 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని, అమృత్​ పథకం  కింద కొనసాగుతున్న అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ, వాటర్​పైప్ లైన్​ పనులను పూర్తి చేయాలని కోరారు. 

నగరంలో నిర్మిస్తున్న కళాభవన్ పనులకు రూ.68 కోట్లు విడుదల చేయాలన్నారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరతను తీర్చి మౌలిక వసతులు మెరుగుపరచాలన్నారు.  పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మహేశ్​కుమార్​గౌడ్, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి ఉన్నారు.