ఫీజులు చెల్లించక స్టూడెంట్స్ ఉసురు తీస్తున్నరు : నిజామాబాద్ ఎంపీ అర్వింద్

ఫీజులు చెల్లించక స్టూడెంట్స్ ఉసురు తీస్తున్నరు : నిజామాబాద్ ఎంపీ అర్వింద్

నిజామాబాద్, వెలుగు: ​ ఫీజు రీయంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బకాయిలు విడుదల చేయకుండా సీఎం రేవంత్​రెడ్డి విద్యార్థుల భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను​నాశనం చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​విమర్శించారు. ఫీజులు కట్టలేని స్టూడెంట్స్ చదువులకు దూరమవుతున్నారని, ప్రభుత్వం వారి ఉసురు తీస్తోందన్నారు. శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల రణభేరి కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. 40 శాతం కమీషన్​ ఇస్తేనే ఫీజు బకాయిలు రిలీజ్ ​చేస్తామని కాలేజ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ సర్కార్​ వచ్చాక రూ.12 వేల కోట్ల మేరకు ఫీజు బకాయి పడిందన్నారు. ఫీజు రీయంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిల కోసం డబ్బులు లేవంటున్నారని, రాయదుర్గం, ఉస్మాన్​నగర్​లో ప్రభుత్వ ల్యాండ్​ అమ్మగా వచ్చిన డబ్బు ఏం చేశారని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్​ డేంజరేస్​ పాలన చేయగా రేవంత్​రెడ్డి డిజాస్టర్​ పాలన చేస్తున్నడన్నారు. 

చంద్రబాబు దగ్గర నేర్చుకో..

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అడ్మినిస్ట్రేషన్​ బాగుందన్న ఎంపీ అర్వింద్.. ఆయనను తన రాజకీయ గురువుగా చెప్పుకునే రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి.. ఆయన వద్దకు వెళ్లి పాలన నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ, పైడి రాకేశ్​రెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ దినేష్​, లీడర్లు మేడపాటి ప్రకాశ్​ రెడ్డి, వడ్డీ మోహన్​రెడ్డి, స్రవంతిరెడ్డి, ప్రదీప్, లక్ష్మీనారాయణ, శివ తదితరులు
పాల్గొన్నారు.