నిజాం ఆస్తులు అమ్ముతున్నాననే ఆరోపణలు అవాస్తవం

నిజాం ఆస్తులు అమ్ముతున్నాననే ఆరోపణలు అవాస్తవం
  • నిజాం ఏడవ మనువడు దిల్షాద్ జా

హైదరాబాద్: నిజాం ఆస్తులను తాను అమ్ముతున్నాననే ఆరోపణలు అవాస్తవమని, నిజాం ఆస్తులకు హక్కు దారుడిని తానేనని ఏడవ నిజాం మనవడు దిల్షాద్ జా స్పష్టం చేసారు. ఆదివారం హైదరాబాద్ నగరంలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మీర్ మిలాద్ అలీ ఖాన్, సజ్జాద్ అలీ ఖాన్ తదితరులతో కలిసి  దిల్షాద్ జా మాట్లాడుతూ కిస్మాతపురలోని దర్గా హజ్రత్ ఖలీజ్ ఖాన్ లో ఉన్న ఐదెకరాల స్థలానికి పూర్తి హక్కు దారుడిని తానేనని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో నిజాం అకాఫ్ కమిటీ తాను ఈ స్థలాన్ని అమ్మేస్తున్నానని, ఆ కమిటీకి చెందిన సయ్యద్ ఖాద్రి ఫయిజ్ ఖాన్, ఫాయిజ్ జంగ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తెలిపారు. నిజాం కు చెందిన ఆస్తులు 1984నుండి కాపాడుతున్నానని వివరించారు. నిజాం ఆకాఫ్ కమిటీ అనేది అధికారిక కమిటీ కాదని, పూర్తి నిరాధారమైనదని అన్నారు. ఈ స్థలానికి సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, తనపై వస్తున్న ఆరోపణల విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు దిల్షాద్ జా తెలిపారు.