వైద్య సదస్సులో ప్రసంగిస్తూ కుప్పకూలిన ప్రొఫెసర్ మృతి

వైద్య సదస్సులో ప్రసంగిస్తూ కుప్పకూలిన ప్రొఫెసర్ మృతి

లండన్:  నిమ్స్ ప్రొఫెసర్ మీనా కుమారి లండన్ లో జరుగుతున్న ఇంటర్ నేషనల్ మెడికల్ సమ్మిట్ లో ప్రసంగిస్తున్న క్రమంలో హార్ట్ ఎటాక్ తో కుప్పకూలి పోయారు. దీంతో హుటాహుటిగా ఆమెను హాస్పిటల్ కు తరలించగా… చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని తెలిపాయి హాస్పిటల్ వర్గాలు. ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసిన యూకే డిప్యూటి హై కమిషనర్‌ డా.ఆండ్రూ ఫ్లెమింగ్‌ ఆమె కుటుంబానికి, సన్నిహితులకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.  తమిళనాడుకు చెందిన మీనాకుమారి గాంధీ ఆస్పత్రి నుంచి ఆమె ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను పూర్తి చేశారు. నిమ్స్‌లో 25 ఏళ్లుగా సేవలందిస్తున్న మీనాకుమారి ప్రత్యేక గుర్తింపును పొందారు.

ఇవికూడా చదవండి..

బైక్ పై హల్ చల్ చేసిన ఎమ్మెల్యే రోజా

ఓటమి భయంతోనే MIMతో సభలు పెట్టిస్తుంది

నో కండీషన్స్ : ఇకపై 24 గంటలు పబ్బులు ఓపెన్