
ఇవాళ, రేపు మెట్రో రైళ్లు నడిచే వేళల్లో ఎలాంటి మార్పూ లేదని హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వి.ఎస్.రెడ్డి వెల్లడించారు. మునుపటిలాగే నిరంతరాయంగా మెట్రో రైళ్ల సర్వీసులు నడుస్తాయని, వాటిని ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రైళ్లు నడిచే వేళలు, స్టాప్ లలో ఎలాంటి మార్పూ ఉండదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు స్పష్టతను ఇచ్చేందుకు ఈమేరకు ప్రకటనను విడుదల చేశారు.