ఐపీఎల్ పదమూడో సీజన్ మ్యాచ్ టైమింగ్స్ లో ఎలాంటి మార్పు లేదు. గత సీజన్ల మాదిరిగానే ఈ సారి కూడా రాత్రి 8 గంటల నుంచే ఆట మొదలవుతుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. టైమింగ్స్ మార్చాలని.. కనీసం అరగంట ముందుగా రాత్రి 7.30 నుంచి మొదలు పెట్టాలన్న పలు స్టేక్ హోల్డర్ల విజ్ఞప్తికి సోమవారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలుపలేదు. కొత్త సీజన్ ఫైనల్ మే 28న ముంబైలో జరుగుతుందని గంగూలీ చెప్పాడు. ‘ఐపీఎల్ టైమింగ్స్ లో మార్పు లేదు. అయితే, డబుల్ హెడర్స్ను తగ్గించాలని నిర్ణయించాం . ఈ సా రి కేవలం ఐదు రోజుల్లోనే రెండేసి మ్యాచ్ లు (సా 4, రా. 8నుంచి) ఉంటాయి. ఫైనల్ ముంబైలో జరుగుతుంది. ఈ సీజన్ లో కాంకషన్ సబ్ స్టిట్యూట్ , నో బాల్ రూల్ (థర్డ్ అంపైర్కు నిర్ణయాధికారం)ను కూడా కొత్తగా యాడ్ చేస్తున్నాం ’ అని తెలిపాడు. మార్చి 29న కొత్త సీజన్ మొదలవనుండగా.. టాప్ ఇంటర్నేషనల్ క్రికెటర్లతో అంతకంటే ముందే ‘ఆల్ స్టార్స్గేమ్ ’ నిర్వహించాలని బోర్డు నిర్ణయించిందన్నాడు.మూడు రోజుల పాటు జరిగే ఈ పోరుకు ఇంకా వేదిక నిర్ణయించలేదన్నాడు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని విరాళంగా ఇస్తామన్నాడు.
ముంబైలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్
- ఆట
- January 28, 2020
లేటెస్ట్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో మనుషులు మింగే 40 రకాల ట్యాబ్లెట్స్ సీజ్.. మెడికల్ షాపులు సీజ్
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...