
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ఎలాంటి క్లాసులు నిర్వహించవద్దని ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఈనెల 30 వరకు సర్కారు సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రకటించిందని గుర్తుచేసింది. సర్కారు ఆదేశాలను ఉల్లంఘిస్తే కాలేజీల మేనేజ్మెంట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.