ఎల్బీనగర్, వెలుగు: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ టీమ్లమధ్య ఈ నెల 13న జరగనున్న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్కు సంబంధించి రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక సూచనలు జారీ చేశారు.
టికెట్, పాసులు ఉన్న వారు మాత్రమే ఉప్పల్ స్టేడియం వద్దకు రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. మిగతా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్ కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వివరించారు. మ్యాచ్ రోజు స్టేడియం వద్ద రద్దీ ఏర్పడకుండా అభిమానులు సహకరించాలని కోరారు.

