
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి. YCP ప్రభుత్వం అవలంబిస్తోన్న…ఆచరణ కాని కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర గౌరవం కాదు… అరాచకాలే ముఖ్యమనే రీతిలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారన్నారు పురంధేశ్వరి.