
- బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్నేత నగేశ్ముదిరాజ్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఉద్యమ ద్రోహులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని, 2018లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ ఇప్పుడు పరోక్షంగా కలిసిపోయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. వైఎస్షర్మిల తెలంగాణకు వ్యతిరేకంగా ఎలా పని చేసిందో అందరికీ తెలుసని, అలాంటి పార్టీతో కాంగ్రెస్కలిసి పని చేస్తుందన్నారు. ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకెళ్లిన రేవంత్రెడ్డిని మించిన తెలంగాణ ద్రోహి ఇంకొకరు లేరన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ముదిరాజ్బీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీశ్రావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్పార్టీ బీసీలను చిన్నచూపు చూస్తున్నదన్నారు. తెలంగాణ వ్యతిరేకులు, ఉద్యమ ద్రోహులతో చేతులు కలిపిన కాంగ్రెస్కు ఓటేందుకు వెయ్యాలో చెప్పాలన్నారు. డీకే శివకుమార్ను ప్రచారానికి తెచ్చి కాంగ్రెస్పార్టీ సెల్ఫ్గోల్కొట్టుకుందని, హిట్వికెట్అయ్యిందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్పాలనలో రాష్ట్రమంతా పచ్చగా మారిం దని, పదేళ్లుగా కరువు లేదు.. కర్ఫ్యూ లేదు.. ఇంత మంచిగా ఉన్నప్పుడు మనం ఎందుకు రిస్క్తీసుకోవాలని హరీశ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగిందని మనం జాలి చూపితే రాష్ట్రం మళ్లీ ఆగమైపోతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎంత గోబెల్స్ప్రచారం చేసినా బీఆర్ఎస్గెలవడం, కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్కొట్టడం ఖాయమన్నారు. ముదిరాజ్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, రానున్న రోజుల్లో రాజకీయ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. నగేశ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణను వ్యతిరేకించిన సమైక్యవాదులతో పొత్తు వద్దని చెప్పినందుకే తనకు టికెట్ఇవ్వలేదన్నారు. పీసీసీ మొత్తం టీడీపీ మయం చేశారని, టికెట్లను కూడా వాళ్లే డిసైడ్చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్లో బీసీ నాయకులకు తీవ్ర అవమానం జరుగుతోందని, వాళ్లు తలవంచుకొని బానిసల్లాగా పని చేస్తున్నారని అన్నారు.