
హైదరాబాద్, వెలుగు: టీశాట్ నెట్ వర్క్ చానెల్స్లో ప్రసారాలకు ఎటువం టి ఇబ్బంది లేదని టీశాట్ సీఈవో బోద నపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. టీశాట్ చానెళ్లు ఆగిపోయాయన్న కేటీఆర్ ట్వీట్కు మంగళవారం ఆయన కౌంటర్ ఇచ్చారు. జీశాట్ 8 సిగ్నల్స్లో టీ శాట్ విద్య, నిపుణ చానెల్స్ ప్రసారాలు యధావిధిగా కొనసాగుతున్నాయని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జీశాట్ 16 టెస్ట్ సిగ్నల్ మాత్రమేనని, టీశాట్ ప్రసారాలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పేమెంట్ల కోసం కొత్త నిబంధనలను తీసుకొచ్చిందని, రాష్ట్రంలోని గత ప్రభుత్వ నిర్వాకం వల్లే జీశాట్ 16 ఇంకా అప్గ్రేడ్ కాలేదని వెల్లడించారు. కాగా, నిరుపేద విద్యార్థులు, నిరుద్యో గులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్న టీశాట్ చానెళ్లు.. సర్కారు నిర్లక్ష్యం వల్ల మూగబోయాయని కేటీఆర్ అంతకుముందు ట్వీట్ చేశారు.
ఈ వ్యాఖ్యలను టీశాట్ సీఈవో వేణుగోపాల్రెడ్డి ఖండించారు.