హైదరాబాద్, వెలుగు: తుక్కుగూడలో సెప్టెంబర్ 17న కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన విజయభేరి సభకు రాష్ట్ర సర్కారు అనుమతి నిరాకరించింది. గుడికి చెందిన స్థలంలో రాజకీయ సభ నిర్వహణకు అనుమతినివ్వలేమని దేవాదాయ శాఖ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. కాంగ్రెస్ నేతలు విజయభేరి సభకు తుక్కుగూడలోని శ్రీరామనగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఖాళీ స్థలాన్ని ఖరారు చేశారు.
అక్కడ సభ నిర్వహించుకునేందుకు రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి దేవాదాయ శాఖకు పర్మిషన్ కోసం అప్లై చేశారు. రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ యాక్ట్ ప్రకారం మందిరాల పక్కన రాజకీయ సభలకు అనుమతివ్వరాదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సభకు పర్మిషన్ ఇవ్వలేమని దేవాదాయ శాఖ కమిషనర్ తెలిపారు. సభాస్థలానికి పర్మిషన్ దొరకకపోవడంతో పార్టీ నాయకత్వం ఏ వేదికను ఖరారు చేస్తుందో వేచి చూడాలి.