
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… టీడీపీ హయాంలో ప్రారంభించిన పథకాల పేర్లన్నీ మారబోతున్నాయి. ఇప్పటి వరకు అన్న పేరుతో ఉన్న క్యాంటీన్లను ఇకపై రాజన్న క్యాంటీన్లుగా మారనున్నాయి. సీఎంగా ప్రమాణం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. BC,SC,ST, మైనార్టీలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించే పథకాన్ని YSR చేయూత పథకంగా మార్చనున్నారు.
ఇప్పటికే NTR భరోసా పేరుతో నడుస్తున్న పెన్షన్ పథకాన్ని ఇప్పటికే YSR పింఛన్ గా మార్చారు సీఎం జగన్. ఎన్టీఆర్ వైద్యసేవ ఇకపై YSR ఆరోగ్యశ్రీగా మారబోతోంది. రైతుల కోసం వైయస్ఆర్ భరోసా పథకం రాబోతోంది.